న్యూఢిల్లీ: ఢిల్లీ చీఫ్ సెక్రటరీ(Delhi Chief secretary) నరేశ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 41 కోట్ల ఖరీదైన భూమిని ఆయన 315 కోట్లకు అమ్మినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు దీనిపై ఫిర్యాదు అందింది. విజిలెన్స్ మంత్రి ఆతిష్కు ఫిర్యాదును అందజేశారు. తన కుమారుడు పనిచేస్తున్న కంపెనీకి ఆ భూమిని అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనపై వచ్చిన ఆరోపణలను ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఖండించారు. ఈ కేసులో తానే చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
సిటీలోని 19 ఎకరాల భూమిని 2018లో జాతీయ హైవే సంస్థ కొనుగోలు చేసింది. ద్వారకా ఎక్స్ప్రెస్వే గురించి దాన్ని కొనుగోలు చేశారు.ఆ భూమి ధరను 41 కోట్లగా జిల్లా మెజిస్ట్రేట్ నిర్ణయించారు. కానీ జిల్లా మెజిస్ట్రేట్ హేమంత్ కుమార్ ఆ భూమి విలువను 353 కోట్లకు పెంచేశాడు.
భూమి ఓనర్లకు అధిక మొత్తం చెల్లించాలని ఢిల్లీ చీఫ్ సెక్రటరీ జాతీయ హైవే సంస్థను ఆదేశించినట్లు ఫిర్యాదులో తేలింది. ల్యాండ ఓనర్ సుభాష్ చంద్ర కతురియాతో లింకున్న రియాల్ ఎస్టేట్ వ్యాపారి అమన్ సారిన్తో లింకు ఉన్నది. అయితే చీఫ్ సెక్రటరీ కుమారు కరణ్తో సారిన్కు లింకు ఉన్నట్లు భావిస్తున్నారు.