బెంగళూరు, అక్టోబర్ 2: కర్ణాటకకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి వింత అనుభవం ఎదురైంది. రూ.11లక్షలు పెట్టి కొన్న ఫోక్స్వ్యాగన్ పోలో కారు రిపేర్కు షోరూం రిపేరింగ్ సెంటర్ నిర్వాహకులు రూ.22 లక్షల ఎస్టిమేషన్ ఇచ్చారు. ఇది చూసి కారు యజమాని కంగుతిన్నాడు. అమెజాన్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేస్తున్న అనిరుద్ గణేశ్ కారు ఇటీవల బెంగళూరు వరదలకు దెబ్బతిన్నది. దీంతో అతడు వైట్ఫీల్డ్లోని యాపిల్ ఆటో (ఫోక్స్వ్యాగన్ డీలర్షిప్) రిపేరింగ్ సెంటర్కు కారును తీసుకెళ్లాడు. వారు రిపేరింగ్కు రూ.22 లక్షలు అవుతుందని చెప్పారు. కారుకు ఇన్సూరెన్స్ ఉందని చెప్పగా, సంబంధిత పత్రాలకు రూ.44,840 అడిగారు. దీంతో బాధితుడు కంపెనీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. చివరకు ఆ కంపెనీ ఆదేశాలతో రిపేరింగ్ సెంటర్ నిర్వాహకులు రూ.5 వేలు తీసుకొని, కారు రిపేర్ చేసి ఇచ్చారు.