వడోదర, జూన్ 18: ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న స్వరాష్ట్రం గుజరాత్లో రూ.21 వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. వడోదరలో గుజరాత్ గౌరవ్ అభియాన్ పేరిట కార్యక్రమం జరిగింది. రూ.16 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. వీటిలో 357 కిలోమీటర్ల పొడవైన న్యూపాలంపూర్-మదర్ సెక్షన్ లైన్, 166 కిలోమీటర్ల పొడవైన అహ్మదాబాద్-మిత సెక్షన్ గేజ్ మార్పిడి పనులు ఉన్నాయి. సూరత్, ఉధ్నా, సోమనాథ్, సబర్మతి రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించారు. దీంతో పాటు మరికొన్ని పనులకు కూడా శంకుస్థాపన చేశారు.