Expensive Wedding | పెండ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అపురూపమైన ఘట్టం. వివాహ ఘట్టం వారి జీవితాంతం గుర్తుండిపోయేలా వధూవరులను వారి తల్లిదండ్రులు తీర్చి దిద్దుతారు. మధ్య తరగతి కుటుంబాలకు భారీగా ఖర్చు చేయడం కాసింత కష్టమే.. కానీ కుబేరులు, సంపన్న కుటుంబాలు తమ పిల్లల పెండ్లిని తమ వద్ద ఉన్న సంపద, హోదా దర్పం ప్రదర్శించేందుకు వినియోగిస్తుంటారు.
పలువురు భారతీయ కుబేరులు తమ పిల్లల పెండ్లిండ్లకు అత్యంత విలాసవంతమైన క్రేజీ ఏర్పాట్లతో ప్రపంచాన్ని షాక్కు గురి చేస్తుంటారు. మైనింగ్ చక్రవర్తిగా పేరొందిన గాలి జనార్ధన రెడ్డి కూతురు బ్రాహ్మణి రెడ్డి, పారిశ్రామికవేత్త విక్రమ్ దేవా రెడ్డి తనయుడు రాజీవ్ రెడ్డి పెండ్లి ఏర్పాట్లు అంబరాన్నంటాయి. ఇప్పటి వరకూ భారత్లోనే అత్యంత ఖర్చుతో కూడిన పెండ్లి అని చెబుతున్నారు.
బ్రాహ్మణిరెడ్డి, రాజీవ్ రెడ్డి పెండ్లి కోసం ఆహ్వానితులకు ఎల్సీడీ ఇన్విటేషన్ కార్డులు పంపిణీ చేస్తే, వధువుకు రూ.17 కోట్ల విలువైన లెహెంగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. రూ.90 కోట్ల విలువైన ఆభరణాలు తయారు చేయించారు. వెడ్డింగ్ కార్డు తయారీకి సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేశారు. 50 వేల మందికి పైగా ఆహ్వానితులతో ఐదు రోజుల పాటు వైభవంగా సాగింది పెండ్లి వేడుక. మొత్తం పెండ్లి ఖర్చు రూ.500 కోట్లు ఉంటుందని వార్తలొచ్చాయి. ఇంకా బ్రెజిల్ సాంబ డ్యాన్సర్లు, కంసాలే, నందికులు కునిట, ట్రైబల్ డ్యాన్స్ తదితర కోసం 100 కల్చరల్ ట్రూప్స్ మరో ఆకర్షణ.