జంషెడ్పూర్: జార్ఖండ్(Jharkhand)లో దారుణం జరిగింది. జెంషెడ్పూర్లోని ఓ జాతీయ బ్యాంకులోకి పట్టపగలే దోపిడీ జరిగింది. మాస్క్లు ధరించిన ఆరుగురు వ్యక్తులు 13 లక్షలు లూటీ చేశారు. ఈస్ట్ సింగ్బమ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బ్యాంకు భోజన విరామ సమయంలో దుండగులు చొరబడ్డారు. గన్పాయింట్లో ఉద్యోగుల్ని బెదిరించారు. ఆ తర్వాత లూటీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. బ్యాంకు సిబ్బందికి చెందిన బంగారు గొలుసులు, మొబైల్ ఫోన్లు, వ్యాలెట్లు కూడా చోరీ చేశారు.
ఐసీఐసీఐ బ్యాంకులో సుమిత్ కుమార్ గుప్తా అనే ఐటీసీ ఉద్యోగి నగదు డిపాజిట్ చేస్తున్న సమయంలో క్రిమినల్స్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో బ్యాంకులో విచారణ చేపట్టేందుకు సిటీ ఎస్పీతో పాటు ఇతర సీనియర్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. నిందిత వ్యక్తులు చాలా పక్కగా ఈ దోపిడీకి పాల్పడినట్లు ఎస్పీ రాజ్కుమార్ మెహతా తెలిపారు.