బెంగళూరు, నవంబర్ 10: బస్సులో ల్యాప్టాప్ తీసుకెళ్లాడని అదనంగా రూ.10 చార్జి విధించాడో కండక్టర్. ఈ ఘటన కర్ణాటక ఆర్టీసీలో చోటుచేసుకొన్నది. ఓ ప్రయాణికుడు గడగ్నుంచి హుబ్లీకి ఆర్బీసీ బస్సు లో బయలుదేరాడు. అతడి వద్ద ల్యాప్టాప్ ఉండటం చూసిన కండక్టర్.. అదనంగా రూ.10 ఇవ్వాలని అడిగాడు. ఎందుకనడిగితే, కొత్తరూల్స్ వచ్చాయి, ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పాడు. లగేజీ 30 కిలోలు దాటితేనే ఇవ్వాలనుందని చెప్పినా, కండక్టర్ ఒప్పుకోలేదు. దీంతో ఆ ప్రయాణికుడు అదనంగా రూ.10 చెల్లించాల్సి వచ్చింది.