Axis bank | పాట్నా : బీహార్లోని వైశాలి జిల్లాలో భారీ చోరీ జరిగింది. మంగళవారం ఉదయం యాక్సిస్ బ్యాంకులోకి ప్రవేశించిన నలుగురు దొంగలు పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి రూ. కోటి లూటీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. వైశాలి జిల్లా లాల్గంజ్ బ్లాక్లోని టీన్పుల్వా చౌక్లోని యాక్సిస్ బ్యాంకులోకి మంగళవారం ఉదయం నలుగురు దొంగలు ప్రవేశించారు. దొంగలు తమ ముఖాలకు మాస్కులు ధరించారు. తమ వద్ద ఉన్న తుపాకులతో బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారులను బెదిరించి, నగదును దోచుకెళ్లారు. సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురిలో ఒక దొంగ బ్యాంకు బయట ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. బ్యాంకు బయట ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.