బెంగుళూరు: కర్నాటక రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. కోరమంగళం ప్రాంతంలో ఉన్న యూనియన్ బ్యాంక్లో 30 ఏళ్ల రౌడీషీటర్ బాబ్లీ జోషఫ్ను ఓ గ్యాంగ్ హత్య చేసింది. వేట కొడవళ్లు, కత్తులతో అతన్ని నరికి చంపారు. 8 మంది అతన్ని హత్య చేసినట్లు తెలుస్తోంది. భార్య, కూతురు ముందే.. బ్యాంక్లో దారుణంగా అతన్ని చంపేశారు. ఈ హత్యను ముఠా కక్ష్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో అడుగోడి పోలీసు స్టేషన్లో బాబ్లీపై హత్యాయత్నం కేసు ఉన్నది. భర్తను నరికే సమయంలో భార్య అడ్డుపడింది. అయితే ఆమె రెండు వేళ్లు తెగినట్లు తెలుస్తోంది. బ్యాంక్ ముందు టూ వీలర్ వాహనాలను పార్క్ చేసిన ఓ గ్యాంగ్.. కత్తులతో బ్యాంక్లోకి వెళ్లి బాబ్లీని హత్య చేసింది.