న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ముఖేశ్ అంబానీ ఇవాళ ప్రారంభమైన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2021లో మాట్లాడారు. 5జీని వీలైనంత త్వరగా దేశంలోనే ప్రవేశపెట్టాలని, దానికే ప్రాముఖ్యతను ఇవ్వాలని ఆయన అన్నారు. భారతీయు మొబైల్ యూజర్లు కూడా 2జీ నెట్వర్క్ నుంచి 4జీకి వెళ్లాలని, ఈ లోగా టెక్నాలజీ పరిశ్రమలు 5జీ ఉద్యమానికి సన్నద్దం అవుతాయని ముఖేశ్ అన్నారు. మొబైల్ వినియోగదారుల సంఖ్యను పెంచేందుకు 5జీ టెక్నాలజీ కూడా దోహదపడుతుందన్నారు. 4జీ, 5జీ సేవల విస్తరణపై జియో దృష్టి పెట్టిందని, బ్రాండ్ బ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు. వంద శాతం సమగ్రమైన స్వదేశీ 5జీని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. దీంతో జియోలో 4జీ నుంచి 5జీకి ఈజీగా అప్డేట్ కావొచ్చు అని తెలిపారు.