ముంబై, ఏప్రిల్ 8: ఔషధాల ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మరో అన్యాయమైన నిర్ణయం తీసుకున్నదని ఎన్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి మహేష్ తపసే శుక్రవారం డిమాండ్ చేశారు.
ప్రజలు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతుంటే, మోదీ సర్కార్ మరింతగా భారాలు మోపుతున్నదని, 800 అత్యవసర మందుల ధరలను ఈనెల 1 నుంచి 11 శాతం మేర పెంచుతూ అన్యాయమైన నిర్ణయం తీసుకున్నదని మండిపడ్డారు.