న్యూఢిల్లీ: బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్కు వచ్చి అర్ధసెంచరీ పూర్తిచేశాడు. గాయం తీవ్రం కావడంతో మూడో వన్డేలో ఆడలేదు. ఇప్పటికీ గాయం ఇంకా నయం కాకపోవడంతో తొలి టెస్టుకు కూడా రోహిత్ శర్మను దూరం పెట్టారు.
రోహిత్ శర్మ స్థానంలో కొత్త బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ను జట్టులోకి తీసుకున్నారు. కాగా బంగ్లాదేశ్తో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆ దేశంలో పర్యటిస్తున్నది. మూడు వన్డేల సిరీస్లో భారత్ 2-1 తేడాతో ట్రోఫీని చేజార్చుకుంది. ఈ నెల 14 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు 14 నుంచి 18 వరకు, రెండో టెస్టు 22 నుంచి 26 వరకు జరగనుంది.