లక్నో: రోడ్డు మధ్యలో కుంగింది. దీంతో 20 అడుగుల లోతైన భారీ గొయ్యి ఏర్పడింది. (Road Caves In) ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ రోడ్డును మూసివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం వికాస్ నగర్ మెయిన్ రోడ్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముందున్న రోడ్డు కుంగిపోయింది. దీంతో 20 అడుగుల లోతులో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు కుంగడంతో ఏర్పడిన పెద్ద గోతిని పరిశీలించారు. ముందు జాగ్రత్త కోసం అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ రోడ్డును మూసివేశారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఈ ప్రాంతంలో తరచుగా రోడ్లు కుంగి భారీగా గోతులు ఏర్పడుతున్నాయని స్థానికులు విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.
In Vikas Nagar, Lucknow, India Main Road collapsed, creating a 20-foot pit. Road repairs had been ongoing for months. The incident occurred near the power house, with the municipal commissioner and officials present at the site. pic.twitter.com/MZmXpZZYgR
— BigBreakingWire (@BigBreakingWire) December 16, 2024