Road Accident | దేశంలో రోడ్డు ప్రమాదాలో మరణాల్లో వారి గణాంకాలను కేంద్రానికి చెందిన రెండు ఏజెన్సీలు ఇటీవల వెల్లడించాయి. అయితే, ఈ లెక్కల్లో భారీగా తేడాలున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, కేంద్ర రోడ్డు రవాణాశాఖ ఇటీవల గణాంకాలను విడుదల చేశాయి. ఇందులో 2022 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్యలో చాలా తేడాలు కనిపించాయి. రెండు డేటాలను పోల్చి చూయడగా.. తేడాలను వెలుగు చూశాయి. 2022 సంవత్సరంలో వాహనాలు ఢీకొని కాలినడకన వెళ్తున్న 32,825 మంది ప్రాణాలు కోల్పోయారని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఎన్సీఆర్బీ విడుదల చేసిన డేటాలో తక్కువగా ఉండడం ప్రస్తావనార్హం. అయితే, డేటా సేకరణ వ్యవస్థరు మెరుగుపరచాలని చాలాకాలంగా డిమాండ్ ఉన్నది. డేటా సేకరణలో పాల్గొనే వ్యక్తులకు సరైన శిక్షణ లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. రోడ్డు మంత్రిత్వశాఖలో క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన లేకపోవడంతో ఇలాంటి లోపాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2022లో ద్విచక్ర వాహనాల ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 74,897 కాగా.. ఎన్సీబీఆర్ నివేదిక ఈ సంఖ్య 77,876గా పేర్కొంది.
వాహనాలు ఢీకొని పాదచారుల మరణాల సంఖ్య మంత్రిత్వ శాఖ 32,825 ఉందనగా.. ఎన్సీఆర్బీ ప్రకారం డేటా 24,742 మృతి మరణించినట్లు తెలిపింది. కార్లు, తేలికపాటి మోటారు వాహనాల ప్రమాదాల్లో 21,040 మంది మరణించారని మంత్రిత్వ శాఖ తెలుపగా.. ఈ సంఖ్య 24,086గా ఉందని ఎన్సీఆర్బీ చెప్పింది. గతేడాదిలో మొత్తంగా 1,68,491 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ డేటా తెలుపగా.. ఎన్సీఆర్బీలో 1,71,100 ఉందని డేటా వివరించింది. అయితే, రోడ్డు, హోం మంత్రిత్వశాఖ మధ్య సమన్వయం అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. దాంతో దేశంలో రోడ్డు ప్రమాదాలు, వాటితో సంభవించే మరణాలపై ఖచ్చితమైన డేటాను పొందగలమని చెప్పారు.