RLD | న్యూఢిల్లీ: జయంత్ చౌదరికి చెందిన ఆర్ఎల్డీ పార్టీ అధికారికంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరింది. శనివారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. జయంత్ చౌదరిని ఎన్డీయేలోకి ఆహ్వానించారు. దేశ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇటీవలి వరకు ఆర్ఎల్డీ.. ఇండియా కూటమిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే జయంత్ చౌదరి తాత, మాజీ ప్రధాని చరణ్సింగ్కు కేంద్రం ఇటీవల భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో జయంత్ చౌదరి బీజేపీకి దగ్గరయ్యారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో యూపీలో ఆర్ఎల్డీ రెండు స్థానాల్లో పోటీచేయనుంది.