న్యూఢిల్లీ : విపక్షాలు టార్గెట్గా షార్ట్కట్ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ స్పందించింది. ప్రధాని మోదీ ప్రజలకు తాను ఇచ్చిన హామీలను సులభంగా ఏమారుస్తున్నారని దుయ్యబట్టింది. హామీలపై ప్రశ్నలకు మోదీ బదులివ్వడం లేదని మండిపడింది. గుజరాత్లో బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తున్న ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్లో కాషాయ పార్టీ పరాజయం ఊసెత్తడం లేదని ఆర్జేడీ నేత పేర్కొన్నారు.
ఇప్పుడు షార్ట్కట్ పాలిటిక్స్పై మాట్లాడుతున్న ప్రధాని ముందుగా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతకు ఇచ్చిన హామీ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం కేవలం 7 లక్షల మందికే ఉపాధి కల్పించి చేతులు దులుపుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ తన హామీ నెరవేరిస్తే ఇప్పటికి 8 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవని ఆర్జేడీ నేత పేర్కొన్నారు.
ఇక ప్రధాని మోదీ నాగపూర్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల్ని వంచిస్తున్నాయని, షార్ట్కట్ పాలిటిక్స్ మన దిశను నిర్ధేశించడాన్ని తాము అనుమతించబోమని వ్యాఖ్యానించారు. తప్పుడు హామీలతో గద్దెనెక్కాలనుకునే వారు ప్రభుత్వాన్ని నడపలేరని అన్నారు. అభివృద్ధి ప్రాధాన్యతను ఆయా రాజకీయ నేతలు అర్ధం చేసుకోవాలని తాను కోరుతున్నానని ప్రధాని పేర్కొన్నారు.