న్యూఢిల్లీ, జూలై 31: ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కొన్ని ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. యూపీఏ-1 ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా పనిచేసినప్పుడు ఈ కుంభకోణానికి పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తున్నది.
అభ్యర్థుల నుంచి భూములు తీసుకుని రైల్వేలో గ్రూప్ డీ ఉద్యోగాలు కల్పించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఇప్పటికే లాలూ కుటుంబ సభ్యులను ఈడీ విచారించింది. తాజాగా లాలూ, ఆయన సతీమణి రబ్రీదేవి, కుమార్తె మీసాభారతికి చెందిన రూ.6 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది.