న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మూడు నెలల తర్వాత స్వదేశానికి చేరుకున్నారు. కిడ్నీ, గుండె సంబంధి సమస్యతో బాధపడుతున్న ఆయన.. గతేడాది డిసెంబర్లో చికిత్స నిమిత్తం సింగపూర్ వెళ్లారు. అక్కడ లాలూకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీని సింగపూర్ వైద్యులు లాలూకు విజయవంతంగా అమర్చారు. ఆపరేషన్ అనంతరం అక్కడే కోలుకుంటున్న లాలూ.. శనివారం రాత్రి భారత్ చేరున్నారు. ఢిల్లీలోని విమానాశ్రయంలో ఆయనను చూసేందుకు కార్యకర్తలు, అభిమానాలు భారీఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అభిమానుకు అభివాదం చేస్తూ తన నివాసానికి వెళ్లిపోయారు.
అంతకుముందూ లాలూ కుమార్తే రోహిణి ఆచార్య ఇదే విషయాన్ని రోహిణి ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ ముఖ్యమైన విషయం మన అధినేత లాలూజీ ఆరోగ్యం గురించి. నాన్న ఫిబ్రవరి 11న సింగపూర్ నుంచి ఇండియా వెళ్తున్నారు. కూతురిగా నా డ్యూటీ చేస్తున్నాను. నాన్నను ఆరోగ్యంగా పంపిస్తున్నాను. ఇప్పుడు మీరంతా మా నాన్నని జాగ్రత్తగా చూసుకోండి. ఆపరేషన్ తర్వాత నాన్నకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇండియాకు వచ్చిన తర్వాత లాలూను కలిసే వారంతా మాస్క్ ధరించాలని కోరుతున్నా’ అని రోహిణి ఆచార్య ట్వీట్ చేశారు.
आप सबसे एक जरूरी बात कहनी है. यह जरूरी बात हम सबों के नेता आदरणीय लालू जी के स्वास्थ्य को लेकर है.
11 फरवरी को पापा सिंगापुर से भारत जा रहे हैं.
मैं एक बेटी के तौर पर अपना फर्ज अदा कर रही हूँ. पापा को स्वस्थ्य कर आप सब के बीच भेज रही हूँ..
अब आप लोग पापा का ख्याल रखियेगा. pic.twitter.com/GcVNV1Emly
— Rohini Acharya (@RohiniAcharya2) February 10, 2023
आप सबसे एक जरूरी बात कहनी है. यह जरूरी बात हम सबों के नेता आदरणीय लालू जी के स्वास्थ्य को लेकर है.
चिकित्सकों ने कहा है कि पापा को इंफेक्शन से बचाना होगा. ज्यादा लोगों से मिलने को लेकर चिकित्सकों ने मना किया है.
— Rohini Acharya (@RohiniAcharya2) February 11, 2023
లాలూ ప్రసాద్ యాదవ్ కొన్నేళ్లుగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న విషయం
తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సింగపూర్ వెళ్లిన
లాలూ.. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. లాలూని పరీక్షించిన సింగపూర్ వైద్యులు కిడ్నీ
ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు కిడ్నీ దానం చేసేందుకు
సింగపూర్లో ఉంటున్న ఆయన చిన్న కుమార్తె రోహిణి ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో
గతేడాది డిసెంబర్ 5న లాలూ ప్రసాద్ యాదవ్కు సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో కిడ్నీ
మార్పిడి జరిగింది.