పాట్నా: బీహార్లోని ఓ ఆస్పత్రి(Patna hospital)లో అయిదుగురు దుండగులు ఫైరింగ్ జరిపారు. పాట్నాలో ఉన్న పారస్ హెచ్ఎంఆర్ఐ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఆగంతకులు జరిపిన కాల్పుల్లో చందన్ అనే వ్యక్తి గాయపడ్డాడు. ఆ వ్యక్తి పెరోల్పై చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. కాల్పులకు పాల్పడినవారిని స్థానికంగా పనిచేసే బిల్డర్లుగా భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్తో లింకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గతంలో ఆ సాయుధులపై నేరాలు ఉన్నట్లు ఆనవాళ్లు లేవు. చందన్ అనే వ్యక్తి మినహా.. ఆస్పత్రిలో మరో వ్యక్తి గాయపడలేదు.
ఆస్పత్రి లాబీలోకి వరుసగా ఎంట్రీ ఇస్తున్న అయిదురి దృశ్యాలు సీసీకెమెరాకు చిక్కాయి. ఓ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. రూమ్ సమీపిస్తున్న సమయంలో తమ దగ్గర దాచుకున్న గన్స్ తీశారు. బాధితుడిని బక్సర్ జిల్లా వాసి చందన్ మిశ్రాగా గుర్తించారు. చందన్పై మర్డర్ కేసులు ఉన్నాయి. అతను జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. చికిత్స కోసం అతను ప్రస్తుతం పెరోల్పై బయటకు వచ్చాడు.
ఆస్పత్రి రూమ్లో చందన్ ఉన్న సమయంలో అయిదుగురు వ్యక్తులు పిస్తోల్స్తో ఎంట్రీ ఇచ్చారు. పాట్నా ఎస్ఎస్పీ కార్తికేయ కే శర్మ మాట్లాడుతూ.. నేరస్థుడు చందన్ మిశ్రాను .. బక్సర్ నుంచి భగల్పుర్ జైలుకు తరలించినట్లు తెలిపారు. అతనిపై డజన్ సంఖ్యలో మర్డర్ కేసులు ఉన్నట్లు చెప్పారు. బహుశా ప్రత్యర్థి గ్యాంగ్ అతన్ని కాల్చి ఉంటుందని ఎస్ఎస్పీ కార్తికేయ తెలిపారు. షూటింగ్కు పాల్పడిన వ్యక్తుల ఫోటోలు ఉన్నాయని, వాటి ఆధారంగా ప్రత్యర్థి ముఠా వ్యక్తులను గుర్తించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
CCTV footage of Chandan Mishra’s murder inside Paras Hospital (Patna) has surfaced.
He was brutally shot inside the hospital premises.
Where is the security? Where is Bihar heading?#ParasHospital #ChandanMishra #Bihar pic.twitter.com/ZZZP95PYje— Tarun Choubey 🇮🇳 (@Tarunchoubey4) July 17, 2025