న్యూఢిల్లీ: దేశంలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. రోజులు జరుగుతున్నా కొద్ది సన్న బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఒక క్వింటల్ బియ్యం ధర రూ.1000 నుంచి 1500 వరకు పెరిగింది. రాబోయే రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత ఏడాది దేశంలో ఒక క్వింటాల్ బియ్యం ధర రూ.4,500 నుంచి రూ.5,000 వరకు ఉండేది. ఇప్పుడు భారీ పెంపు కనిపిస్తున్నది. బియ్యం రకాన్ని బట్టి HMT, BPT, సోనామసూరి బియ్యం ధరలు ప్రస్తుతం రూ.6200 నుంచి రూ.7500 వరకు పలుకుతున్నాయి. బియ్యం ధరలు పెరగటానికి ప్రధాన కారణం వరదల నష్టం వల్ల పంటల దిగుబడి తగ్గడం, వారి సాగు విస్తీర్ణం తగ్గడం అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.