గువాహతి: ఒక ఖడ్గమృగం గుంపుగా ఉన్న జనాన్ని తరిమింది. దీంతో వారు ఉరుకులు, పరుగులు తీశారు. ఈ సంఘటనలో ఇద్దరు గాయపడ్డారు. అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మోహిమా గ్రామంలోకి ఖడ్గమృగం వచ్చింది. గుంపుగా ఉన్న కొందరిపైకి అది దూసుకొచ్చింది. దీంతో వారు భయంతో పరుగులు తీశారు. ఖడ్గమృగం దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పరుగులు తీస్తుండగా ఇద్దరు కింద పడ్డారు. వారు స్వల్పంగా గాయపడ్డారు.
కాగా, స్థానికులు ఈ విషయంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆ గ్రామానికి వెళ్లారు. ఖడ్గమృగాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అది వారిపై దాడి చేసింది. ఈ సంఘటనలో డివిజనల్ అటవీ అధికారి సుశీల్ కుమార్ ఠాకూరియా, మరో అధికారి గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఖడ్గమృగం జనాన్ని తరుముతుండగా చెట్టుపై ఉన్న వ్యక్తి తన మొబైల్ ఫోన్లో దీనిని రికార్డ్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video: Rhino Charges Through A Crowd In Assam, 2 Injured https://t.co/FRmuPazBZM pic.twitter.com/eQXL8c7Sna
— NDTV (@ndtv) February 4, 2023