న్యూఢిల్లీ: ఆర్టికల్ 370పై ఇచ్చిన తీర్పుపై పునర్విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. 370 అధికరణను రద్దు చేస్తూ 2019లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
దీన్ని సమీక్షించాలని జమ్ముకశ్మీర్ పీపుల్స్ మూమెంట్ అధ్యక్షుడు హుస్సేన్, జమ్ముకశ్మీర్ అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ముజఫర్ షా, సీపీఎం నేత తరిగామి, న్యాయవాది ముజఫర్ ఇక్బాల్ పిటిషన్లు దాఖలు చేశారు.