న్యూఢిల్లీ: కరోనా టీకా కొవిషీల్డ్ తయారీని పునఃప్రారంభించినట్టు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా బుధవారం వెల్లడించారు. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పెద్దల కోసం తమ కంపెనీ ఇప్పటికే 60 లక్షల కొవోవాక్స్ బూస్టర్ డోసులను సిద్ధం చేసిందని, ఈ టీకాలను తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఈ టీకా కొవిన్ యాప్లో అందుబాటులో ఉన్నదని వెల్లడించారు. ప్రస్తుతం టీకాల తయారీకి తయారీదారులు సిద్ధంగా ఉన్నా డిమాండ్ లేదని పేర్కొన్నారు.