Assembly Election Results 2023: హిందీ బెల్ట్లో కాంగ్రెస్ను బీజేపీ మరోసారి చావుదెబ్బ తీసింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్నిమూటగట్టుకుంది. రాజస్తాన్లో హోరాహోరి పోరు తప్పదనుకున్నా ఫలితాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. సాయంత్రం ఆరు గంటలకు వెలువడ్డ ఫలితాల ప్రకారం.. బీజేపీ 115 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 68 స్థానాలలో మాత్రమే ముందంజలో ఉంది. రాజస్తాన్ ఎన్నికల ఫలితాలపై తాజాగా రాష్ట్ర ముఖ్యమంతి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఫలితాలు తమకు నిరాశకు గురిచేశాయని అన్నారు.
ఫలితాల వెలువడుతున్న క్రమంలో గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ.. ఫలితాలు షాక్కు గురిచేస్తున్నాయి. మేము (కాంగ్రెస్) రాజస్తాన్తో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కూడా ఓడిపోయాం. ఓడినా నేను ప్రజలకు అందుబాటులోకి ఉంటాను. అధికారంలో ఉన్నా లేకున్నా నేను ప్రజలతోనే ఉంటా.. అని అన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీపై ప్రతీకారం తీర్చుకుంటారని తాను భావించానని కానీ అలా జరగలేదని తెలిపారు.