న్యూఢిల్లీ: ఇటీవల గోధుమల ఎగుమతులను నిషేధించిన కేంద్రం తాజాగా చక్కెర ఎగుమతులపై కూడా పరిమితులు విధించింది. సెప్టెంబర్తో ముగియనున్న ప్రస్తుత మార్కెటింగ్ ఏడాదిలో చక్కెర ఎగుమతులను కోటి టన్నుల వరకు మాత్రమే పరిమితం చేస్తామని కేంద్రం పేర్కొన్నది. దేశీయంగా సరిపడా సరుకు అందుబాటులో ఉంచడంతో పాటు ధరల స్థిరత్వం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.