న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో అంతర్జాతీయ కమర్షియల్ పాసింజర్ విమాన సర్వీసులపై విధించిన నియంత్రణలను ఆగస్ట్ 31 వరకూ పొడిగించారు. కొవిడ్-19 వ్యాప్తి నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఆగస్ట్ 31 రాత్రి 11.59 గంటల వరకూ ఈ నియంత్రణలు అమల్లో ఉంటాయని డీజీసీఏ స్పష్టం చేసింది. అంతర్జాతీయ సరుకు రవాణా కార్యకలాపాల సేవలు, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమానాలకు ఈ నియంత్రణలు వర్తించవని పేర్కొంది. డీజీసీఏ ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ విమానాలను ఆయా సందర్భాలను అనుసరించి అనుమతించే వెసులుబాటు కల్పిస్తారు.