న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: కరోనా ఉద్ధృతి, రోజురోజుకూ పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో ఈసారి గణేశ్ ఉత్సవాలు కళ తప్పనున్నాయి. మరో రెండురోజుల్లో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలపై దేశంలోని వివిధ రాష్ర్టాలు ఆంక్షలు విధించాయి.
కర్ణాటక: పండుగ ప్రారంభమైన ఐదు రోజుల్లోనే విగ్రహాల నిమజ్జనం, నిమజ్జన ఉత్సవాల్లో గరిష్ఠంగా 20 మందికి అనుమతి, నిర్వహకులకు కొవిడ్-19 నెగటివ్ ధ్రువపత్రం తప్పనిసరి
తమిళనాడు: బహిరంగ ప్రాంతాల్లో విగ్రహాల ప్రతిష్టపై నిషేధం. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన విగ్రహ తయారీదారులకు రూ. 5 వేల చొప్పున పరిహారం.
ఆంధ్రప్రదేశ్: రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ విగ్రహ ప్రతిష్ట, ఉత్సవాల నిర్వహణపై నిషేధం.
గోవా: నిమజ్జనంలో టపాసులపై నిషేధం. సాయంత్రం 5-10 గంటల మధ్యే నిమజ్జన కార్యక్రమం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన విగ్రహాలపై నిషేధం, ఇండ్లల్లోకి పురోహితులను ఆహ్వానించడంపై నిషేధం ఎత్తివేత
మహారాష్ట్ర: వినాయక చవితి సందర్భంగా కొంకణ్కి వెళ్లే పర్యాటకులకు రోడ్డు, టోల్ ట్యాక్సీ రద్దు
బెంగాల్లో దుర్గాపూజకు: కొవిడ్-19 కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దుర్గా పూజ కమిటీలకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం, కరెంట్ బిల్లులో 50 శాతం మాఫీ, ఉచిత లైసెన్సుల జారీ