న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 : దక్షిణాసియాలో ముఖ్యంగా భారత్లో మధుమేహాన్ని గుర్తించడానికి, పర్యవేక్షించడానికి కేవలం ైగ్లెకేటెడ్ హిమోగ్లోబిన్(హెచ్బీఏ1సీ) పైనే ఆధారపడడం పట్ల పరిశోధకులు హెచ్చరికలు జారీచేశారు. రక్తహీనత, రక్త రుగ్మతలు అధికంగా ఉంటే.. బ్లడ్ షుగర్ వాల్యూస్ను అధ్యయనం చేయడం క్లిష్టతరంగా మారుతుందని పరిశోధకులు తెలిపారు. ది లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ఈస్ట్ ఆసియా జర్నల్లో ప్రచురించిన ఓ వ్యాసంలో ఈ అభిప్రాయాలను పరిశోధకులు వ్యక్తం చేశారు.
ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్ష, బ్లడ్ గ్లూకోజ్ స్వీయ పర్యవేక్షణ, నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణతోపాటు సంబంధిత రక్తసంబంధ హెమటాలాజిక్ అంచనాలు చేసుకోవడం మేలని వారు సూచించారు. 1976లో గ్లూకోజ్ నియంత్రణ, హిమోగ్లోబిన్ ైగ్లెకేషన్ మధ్య సంబంధం గుర్తించినప్పటి నుండి ైగ్లెసెమిక్ నియంత్రణను కొలవడానికి హెచ్బీఏ1సీ బలమైన ప్రమాణంగా మారిందని పరిశోధకులు తెలిపారు. భారత ఉపఖండంలో డయాబెటిస్ సంబంధిత రుగ్మతలను గణనీయంగా నివారించడానికి ైగ్లెసెమిక్ నియంత్రణ ముఖ్యమని వారు పేర్కొన్నారు.