Uttarakhand Tunnel | డెహ్రాడూన్, నవంబర్ 19: ఉత్తరాఖండ్లోని ఉత్తర్కాశీ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించడానికి రక్షణ బృందాలు చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. దీంతో వారం రోజులుగా లోపల చిక్కుకుపోయిన కార్మికుల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. సొరంగం నిర్మించిన కొండ పైనుంచి నిలువుగా రంధ్రం చేయడానికి అధికారులు అదివారం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే సమయంలో కార్మికులను రక్షించడానికి అయిదు ప్రత్యామ్నాయ ప్రణాళికలను అమలు చేసేందుకు ప్రధాని కార్యాలయ అధికారుల బృందం, నిపుణులు ప్రయత్నిస్తున్నారు.