ముంబై: కొత్త బిలియనీర్ల జాబితాను ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. దాంట్లో ఇండియా నుంచి 25 మంది ఆ లిస్టులో యాడ్ అయ్యారు. ఆ జాబితాలో రేణుకా జగిత్యాని(Renuka Jagtiani) ఉన్నారు. ఆమె ల్యాండ్మార్క్ గ్రూపు సీఈవో. ఆమె సంపద 4.8 బిలియన్ల డాలర్లు. ల్యాండ్మార్క్ గ్రూపు ను రేణుక భర్త మిక్కీ జగిత్యాని స్థాపించారు. ఆయన గత ఏడాది మేలో మరణించారు. ల్యాండ్మార్క్ గ్రూపులో సుమారు 50 వేల మంది ఉద్యోగం చేస్తున్నారు. ముంబై యూనివర్సిటీ నుంచి ఆమె ఆర్ట్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. 2007లో ఆమెకు ఔట్స్టాండింగ్ ఏషియన్ బిజినెస్ వుమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. 2012లో గల్ఫ్ బిజినెస్ పరిశ్రమకు ఆమెకు బిజినెస్వుమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందజేసింది. 2014లో ఎంత్రప్యూనర్ ఆఫ్ ద వరల్డ్ ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. 2017లో వరల్డ్ రిటేల్ కాంగ్రెస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఆమెకు చోటు దక్కింది. ల్యాండ్మార్క్ గ్రూపులో రేణుక 1993లో చేరారు. మిడిల్ ఈస్ట్లో తమ సంస్థ విస్తరణ కోసం ఆమె తీవ్రంగా శ్రమించారు. భారత ఉపఖండం, పశ్చిమాసియా, ఆఫ్రికాలోనూ రిటేల్ బిజినెస్ విర్తరణకు కృషి చేశారు. రేణుకకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆర్తి, నిషా, రాహుల్. ముగ్గురూ ల్యాండ్మార్క్ కంపెనీలో గ్రూపు డైరెక్టర్లుగా చేస్తున్నారు.