ముంబై : ప్రముఖ మరాఠీ రచయిత, సామాజిక కార్యకర్త డాక్టర్ అనిల్ అవచత్ సుదీర్ఘ అస్వస్థతతో పుణేలోని తన నివాసంలో గురువారం మరణించారు. అనారోగ్యంతో బాధపడుతూ డాక్టర్ అవచత్ (78) కొద్దిరోజుల కిందట ఆస్పత్రిలో చేరిన ఆయనను ఇటీవల ఇంటికి తీసుకువచ్చారు.
పుణే జిల్లాలోని ఒటూర్లో జన్మించిన అవచత్ బీజే మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదివారు. అవచత్ మానస, స్వతహవిషయి, గర్ద్, కార్యరత్, కార్యమగ్న వంటి పలు పుస్తకాలు రచించారు. పలు మరాఠీ మేగజైన్లు, ఇతర ప్రచురణలకు ఆయన తరచూ వ్యాపాలు రాస్తుండేవారు.
జర్నలిజంలోనూ ప్రవేశమున్న డాక్టర్ అచవత్ రిపోర్టింగ్ శైలిలో అందించే రచనలు పాఠకులను ఆకట్టుకునేవి. పలు సామాజిక అంశాలపైనా ఆయన పనిచేశారు. వైద్యం, రచనలు, సామాజిక సేవలే కాకుండా ఆయనకు ఫ్లూట్ వాయించడం, వంట చేయడం, పెయింటింగ్, ఫోటోగ్రఫీ వంటి వృత్తుల్లోనూ ప్రవేశం ఉంది.