న్యూఢిల్లీ: దేశంలో రెమ్డెసివిర్ ఉత్పత్తి సామర్థ్యం ఇప్పుడు నెలకు 90 లక్షల వైల్స్కు పెరిగిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. గతంలో దీని ఉత్పత్తి నెలకు 40 లక్షలుగా ఉన్నదని చెప్పారు. త్వరలో రోజుకు 3 లక్షల రెమ్డిసివిర్ ఇంజక్షన్లు తయారవుతాయని వెల్లడించారు. యాంటీ వైరల్ ఇంజక్షన్ల తయారికి ఈ నెల 12 నుంచి కొత్తగా 25 ఉత్పత్తి కేంద్రాలకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రెమ్డెసివిర్కు బాగా డిమాండ్ ఏర్పడింది. దీంతో కొన్నిచోట్ల వీటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. మరోవైపు ఆసుపత్రుల నుంచి ఈ ఇంజక్షన్లు మాయమవుతుండగా మరి కొన్నిచోట్ల నకిలీవి తయారు చేసి విక్రయిస్తున్నారు.