న్యూఢిల్లీ: మత రాజకీయాలు భారతదేశాన్ని ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్లా తయారుచేస్తాయని పంజాబ్ వ్యవసాయ శాఖ మంత్రి రణ్దీప్ సింగ్ నభా ( Randeep Singh Nabha ) ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ నాయకులు మతసంబంధ విషయాల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని, లేదంటే దేశం ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మాదిరిగా తయారవుతుందని వ్యాఖ్యానించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి, దేశంలో ప్రజాస్వామ్యం నెలకొల్పిన మహనీయులు క్రమం విస్మరణకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
మత రాజకీయాల వల్ల ప్రజల్లో అపనమ్మకం, అభద్రతాభావం పెరిగిపోతాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశం తాలిబన్ ఏలుబడిలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లాగా, పాకిస్థాన్ లాగా మారిపోవడానికి ఎంతో కాలం పట్టదు అని రణ్దీప్ సింగ్ నభా వ్యాఖ్యానించారు. ఇటీవల సింఘు బార్డర్లో జరిగిన హత్యకు కొందరు నేతలు మతం రంగు పులుముతుండటంతో రణ్దీప్ ఈ వ్యాఖ్యలు చేశారు.