భోపాల్, మే 18: మధ్యప్రదేశ్ మాళ్వా ప్రాంతంలోని నీముచ్ పట్టణంలో ఇరువర్గాల మధ్య మతపరమైన విషయాలపై తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఒకవర్గానికి చెందినవారి ప్రార్థనా మందిరం సమీపంలో విగ్రహం ఏర్పాటుపై తగాదా ఏర్పడింది.
ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒకవ్యక్తి ఈ ఘర్షణల్లో గాయపడ్డాడు. అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు.