ఫరుఖాబాద్ (యూపీ), జనవరి 22: మేళతాళాలతో వరుడు గుర్రంపై దర్జాగా పెండ్లి మండపానికి వచ్చాడు. ఇరు కుటుంబాల బంధువులతో మండపం నిండిపోయింది. కాసేపట్లో వివాహ తంతు మొదలుకావాల్సి ఉన్నది. ఇంతలోనే వరుడి ప్రవర్తనపై అనుమానం కలిగింది. 10 రూపాయల నోట్లు 30 తీసుకొచ్చి లెక్క పెట్టాల్సిందిగా వరుడిని వధువు బంధువులు కోరారు. వాటిని అతడు లెక్కబెట్టలేకపోయాడు. ‘కనీసం నోట్లు లెక్కించడం కూడా రాని మొగుడు నాకొద్దు’ అని వధువు పీటల మీది నుంచి లేచి వెళ్లిపోయింది.
ఈ ఘటన యూపీలోని ఫరుఖాబాద్ జిల్లా చోటుచేటుచేసుకున్నది. వధువు కుటుంబానికి మధ్యవర్తి (పెండ్లిళ్ల బ్రోకర్) దగ్గరి బంధువు కావడంతో వరుడిని చూడకుండానే పెండ్లికి అంగీకరించారు. వరుడు మానసిక వికలాంగుడని పురోహితుడు తెలుసుకొని వధువు బంధువులకు తెలిపారు. వారు నోట్లు లెక్కించే పరీక్ష పెట్టడం అందులో వరుడు విఫలం కావడంతో పెండ్లి రద్దయింది. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని స్థానిక ఎస్హెచ్వో తెలిపారు.