న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు పరీక్షా పే చర్చా (Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాలతో ప్రతీఏడాది జనవరి చివరి వారంలో దీనిని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాదికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ప్రధానితో మాట్లాడేందుకు ఆసక్తిగా ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అధికారిక వెబ్సైట్ https://innovateindia.mygov.in/ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
ఈనెల 12 వరకు పరీక్షా పే చర్చ (PPC) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. ఆరు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు. విద్యార్థులు నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా ఉపాధ్యాయుల లాగిన్ ద్వారా తమపేరును నమోదుచేసుకోవచ్చు. అదేవిధంగా తాము అడగదలుచుకున్న ప్రశ్నలను 500 అక్షరాలకు మించకుండా ముందే చెప్పాల్సి ఉంటుంది. కాగా, ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
‘ప్రధాని మోదీతో మాట్లాడేందుకు అందరూ సమాయత్తమవ్వండి. విద్యార్థులు, తల్లిండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఓ గ్రూప్గా ఏర్పడటం వల్ల పిల్లలకు పరీక్షలంటే భయం పోగొట్టి.. వాటిని ఓ ఉత్సవంలా నిర్వహించేందుకు వీలుంటుంది’ అని అందులో పేర్కొంది. గతేడాది సుమారు 38 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఈ సంవత్సరం దాదాపు 2050 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను పరీక్ష పే చర్చకు ఎంపిక చేసే అవకాశం ఉంది. వారికి పీపీసీ కిట్లను విద్యాశాఖ అందించనుంది.
#ParikshaPeCharcha: परीक्षाक संग-संग जीवनसँ जुड़ल जटिल प्रश्न पुछबाक लेल जीवंत मंच अछि – परीक्षा पे चर्चा। अहाँ सबसँ पुनः पुनः निवेदन जे तनाव-मुक्त परीक्षापर माननीय प्रधानमंत्री @narendramodi जीक संग चर्चा-परिचर्चा करबाक लेल प्रतियोगितामे सहभागी बनू।
⏩https://t.co/i089KTirpm… pic.twitter.com/jnbA1Yrq2c
— Ministry of Education (@EduMinOfIndia) December 31, 2023