గౌహతి: శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేకు మద్దతుగా ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు శుక్రవారం ఒక అఫిడవిట్ను సిద్ధం చేశారు. ‘మమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు, స్వచ్ఛందంగా చేరారు’ అని అందులో పేర్కొన్నారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి ఏక్నాథ్ షిండే పంపిన మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల జాబితాలో కొందరి సంతకాలు తప్పుగా ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలు తాజాగా ఈ మేరకు ఒక అఫిడవిట్ రూపొందించారు. తమను ఎవరూ బలవంతం చేయాలని, స్వచ్ఛందంగా షిండే గ్రూప్లో చేరినట్లు అందులో పేర్కొన్నారు. అలాగే శివసేన అసలు గ్రూప్గా గుర్తింపు కోసం న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.
కాగా శివసేన రెబల్ గ్రూపులో మరో ఎమ్మెల్యే చేరారు. శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే శుక్రవారం ఆ శిబిరానికి చేరుకున్నారు. దీంతో 38 మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతుతోపాటు పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందని షిండే పేర్కొన్నారు. మరి కొందరు కూడా తన శిబిరంలో చేరుతారన్న ఆయన మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య 50 దాటుతుందని చెప్పారు.
మరోవైపు అస్సాం రాజధాని గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి మకాం వేసిన ఏక్నాథ్ షిండే శుక్రవారం సుమారు రెండున్నర గంటలపాటు హోటల్ బయట ఉన్నారు. ప్రసిద్ధ కామాఖ్య ఆలయాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేసినట్లు సమాచారం. అనంతరం ఆయన తిరిగి ఆ హోటల్కు చేరుకున్నారు.
#WATCH | Assam: Shiv Sena's Eknath Shinde returns to Radisson Blu Hotel in Guwahati after around 2.5 hours. He had reportedly visited Kamakhya Temple to offer prayers. pic.twitter.com/9yKMRNI3MT
— ANI (@ANI) June 24, 2022