Lalu Prasad Yadavs | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు సింగపూర్లో సోమవారం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగనుంది. ఆయన రెండో కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీని లాలూకు అమర్చనున్నారు. ఇందులో భాగంగా లాలూను వైద్యులు పరీక్షించారు. సర్జరీకి ముందు అవసరమైన టెస్టులు చేశారు. ఇదే సమయంలో రోహిణిని కూడా డాక్టర్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు లాలూ కుమార్తె రోహిణి ట్వీట్ చేశారు.
లాలూ ప్రసాద్ యాదవ్ కొన్నేళ్లుగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సింగపూర్ వెళ్లిన లాలూ.. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. లాలూని పరీక్షించిన సింగపూర్ వైద్యులు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు కిడ్నీ దానం చేసేందుకు సింగపూర్లో ఉంటున్న ఆయన చిన్న కుమార్తె రోహిణి ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
Ready to rock and roll ✌️
Wish me a good luck 🤞 pic.twitter.com/R5AOmFMW0E— Rohini Acharya (@RohiniAcharya2) December 5, 2022