RBI | న్యూఢిల్లీ, మార్చి 31: దేశంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న చట్టవిరుద్ధమైన రుణ యాప్లను నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) డిజిటల్ ఇండియా ట్రస్టు ఏజెన్సీ(డీఐజీఐటీఏ) ఏర్పాటు చేయనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదిత ఏజెన్సీ డిజిటల్ లెండింగ్ యాప్లను వెరిఫై చేస్తుందని, అలాగే వెరిఫికేషన్ అయిన యాప్లకు సంబంధించిన పబ్లిక్ రిజిస్టర్ను నిర్వహిస్తుందని పేర్కొన్నాయి.
డీఐజీఐటీఏ చేత ‘వైరిఫైడ్’ సిగ్నేచర్ లేని యాప్లను అనధికార యాప్లుగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపాయి. నేటి డిజిటల్ యుగంలో దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలకు చెక్ పెట్టడంలో ఈ ఏజెన్సీ కీలక పాత్ర పోషిస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.