న్యూఢిల్లీ : నిబంధనలు ఉల్లంఘించిన మూడు సహకార బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ కొరడా ఝుళింపించింది. యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కోకన్ మెర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సమతా కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ బ్యాంక్ లిమిటెడ్కు ఆర్బీఐ రూ.5లక్షల జరిమానా విధించింది. ఆదాయం, ఆస్తుల వర్గీకరణ తదితర అంశాల్లో మార్గదర్శకాలు పాటించకపోవడంపై ఫాల్టన్కు చెందిన యశ్వంత్ కో ఆపరేటివ్ బ్యాంక్కు రూ.2లక్షల జరిమానా విధించింది.
దీంతో పాటు నిబంధనలు పాటించని ముంబైకి చెందిన కోకాన్ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్కు రూ.2లక్షల జరిమానా విధించింది. అలాగే కోల్కతాకు చెందిన సమతా కో ఆపరేటివ్ డెవలప్మెంట్ బ్యాంక్ లిమిటెడ్కు రూ.లక్ష జరిమానా విధించగా.. రెగ్యులెటరీ కంప్లైయెన్స్లో లోపాలపై జరిమానా విధించినట్లు ఆర్బీఐ పేర్కొంది. అయితే, ఈ చర్య ఆయా బ్యాకుల ఖాతాదారులపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది.