న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో విషాదం నెలకొంది. రీసెర్చ్, అనాలసిస్ వింగ్ (RAW) కు చెందిన ఓ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూఢిల్లీ లోధి కాలనీలో ఉన్న ఏజెన్సీ బిల్డింగ్ పదో అంతస్తు నుంచి కిందకు దూకాడు. దీంతో ఆ అధికారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మానసిక ఒత్తిడి కారణంగానే బాధిత వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.