న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: పీఎం కేర్స్ ట్రస్టీగా టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా నియమితులయ్యారు. ఈయనతోపాటు లోక్సభ మాజీ డిఫ్యూటీ స్పీకర్ కరియా ముండా, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ను కేంద్ర ప్రభుత్వం ట్రస్టీలుగా నియమించింది.
నూతన ట్రస్టీలతో తొలిసారి ప్రధాని మోదీ అధ్యక్షతన పీఎం కేర్స్ సమావేశం మంగళవారం నిర్వహించారని ప్రధాని కార్యాలయం బుధవారం ప్రకటించింది. ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, అమిత్ షా కూడా పీఎం కేర్స్ ట్రస్టీలుగా ఉంటారు. పీఎం కేర్స్కు సలహా కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది.