న్యూఢిల్లీ, జూన్ 13: మధ్యప్రదేశ్లో ఢిల్లీ యూనివర్సిటీ పరిశోధక బృందం జరుపుతున్న తవ్వకాల్లో అరుదైన శిలాజం బయటపడింది. డైనోసార్ గుడ్డులో మరో గుడ్డు ఇమిడి ఉన్న శిలాజం ధార్ జిల్లా బాఘ్ ప్రాంతంలో లభించింది. ఇలాంటి గుడ్డు లభించడం డైనోసార్ శిలాజాల చరిత్రలో ఇదే ప్రథమమని డిల్లీ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిశోధన ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. తాబేళ్లు, బల్లులు లేదా మొసళ్లు, పక్షులు& రెంటిలో డైనోసార్లు వేటికి దగ్గరో తెలుసుకోవడంలో ఈ అధ్యయనం ఉపకరిస్తుందని అంటున్నారు.