బెంగళూర్ : కర్నాటక (karnataka polls) అసెంబ్లీ ఎన్నికలకు నటుడు కిచ్చా సుదీప్ను బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా ప్రకటించడంపై కాంగ్రెస్ స్పందించింది. కర్నాటక భవిష్యత్ను ప్రజలు నిర్ధేశిస్తారని, సినీ స్టార్లు కాదని కాంగ్రెస్ ఎంపీ రణ్దీప్ సింగ్ సుర్జీవాలా పునరుద్ఘాటించారు.
ఎవరికి మద్దతివ్వాలో ఎంచుకునే స్వేచ్ఛ సినీ నటులకు ఉంటుందని కొన్నిసార్లు ఐటీ, ఈడీ, ఇతరులకు కూడా అని ఆయన చురకలంటించారు. కిచ్చా సుదీప్ వ్యవహారంతో కర్నాటకలో బీజేపీ దివాళాకోరుతనం బయటపడిందని అన్నారు. సీఎం బొమ్మై, బీజేపీ నాయకుల మాటలు ఎవరూ వినకపోవడంతో వారు ప్రజలను ఆకట్టుకునేందుకు సినీ నటులపై ఆధారపడ్డారని వ్యాఖ్యానించారు.
కర్నాటక భవిష్యత్ నటులు కాదని, రాష్ట్ర ప్రజలు నిర్దేశిస్తారని సుర్జీవాలా ట్వీట్ చేశారు. కాగా కాంగ్రెస్ విమర్శలకు కాషాయ పార్టీ స్పందిస్తూ నటుడిని బీజేపీలో చేరకుండా బెదిరింపు మెయిల్ పంపడం వెనుక కాంగ్రెస్ ప్రమేయం ఉందా అని ప్రశ్నించింది. గిరిజన వర్గానికి చెందిన వ్యక్తి నటుడిగా ఎదిగి బీజేపీకి ప్రచారం చేయడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ఆరోపించింది.
Read More
Tamilanadu | ఆలయ ఉత్సవాల్లో అపశ్రుతి.. నీటిలో గల్లంతై ఐదుగురు యువకులు మృతి