రాంపూర్: ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వరుస గైర్హాజరీని యూపీలోని రాంపూర్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటిస్తూ, ఆమెను అరెస్ట్ చేసి మార్చి 6న న్యాయస్థానం ముందు హాజరపర్చాలని అధికారులను ఆదేశించింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలపై 2019లో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల్లో ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు పలుసార్లు సమన్లు జారీ చేసినా ఆమె హాజరు కాలేదు. దీంతో ఆమెపై ఏడుసార్లు నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినా పోలీసులు ఆమెను కోర్టు ముందు హాజరుపర్చలేదు. దీంతో జయప్రదను పరారీలో ఉన్న వ్యక్తిగా పరిగణిస్తూ జడ్జి శోభిత్ బన్సాల్ ఆదేశాలు జారీ చేశారు. ఒక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసి ఆమెను అరెస్ట్ చేసి మార్చి 6న న్యాయస్థానంలో హాజరుపర్చాలని రాంపూర్ ఎస్పీని ఆదేశించారు.