BJP Leader : బెంగళూరులో జరిగిన రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు సంబంధించిన కేసుతో కర్ణాటకకు చెందిన బీజేపీ నేతకు లింకు ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఆధారాలు సంపాదించింది. ఆ ఆధారాల ఆధారంగా శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి పట్టణ బీజేపీకి చెందిన ఆ నేతను అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నది.
పది రోజుల క్రితం ఎన్ఐఏ రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసుతో సంబంధం ఉన్న పలువురి ఇండ్లు, దుకాణాలలో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఇటీవల ఎన్ఐఏ ఇంటరాగేట్ చేసిన ఇద్దరు మొబైల్ షాపు యువకులతో స్థానిక బీజేపీ నేతకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. దాంతో కేసుతో అతనికి గల సంబంధాలను తెలుసుకునేందుకు ఇంటరాగేట్ చేస్తున్నది.