భోపాల్: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సర్వం సిద్దమైంది. జనవరి 22వ తేదీన ఆలయాన్ని(Ayodhya Ram Temple) ఓపెన్ చేయనున్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో అలంకరణ కోసం భోపాల్ నర్సరీకి చెందిన కాగితంపూలను వాడనున్నారు. భోపాల్లోని నిసర్గ్ నర్సరీ ఓనర్ రామ్కుమార్ రాథోడ్కు ఆర్డర్ కూడా వెళ్లింది. ఇప్పటి కే ఆ నర్సరీ నుంచి 10వేల పూలకు చెందిన రెండు కంటేనర్లు అయోధ్యకు వెళ్లాయి. జనవరి 22వ తేదీన సుమారు లక్ష మంది రామభక్తులు అయోధ్యలో దర్శనమిచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సుమారు అయిదారు వెరైటీలకు చెందిన పువ్వులు కావాలంటూ తమకు ఆర్డర్లు వచ్చాయని రామ్కుమార్ రాథోడ్ తెలిపారు. తమ వద్ద ఉన్న కాగితంపువ్వులు అన్ని రుతువుల్లోనూ విరబూస్తాయన్నారు. ఆ పుష్పాలకు ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తక్కువ నీటితోనే ఆ పువ్వు మొక్కలను మెయింటేన్ చేయవచ్చు అని తెలిపాడు. బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అయోధ్య ఆలయానికి పువ్వులు పంపే అవకాశం తమకు దక్కినట్లు నర్సరీ ఓనర్ తెలిపాడు. వైట్,ఆరెంజ్, రెడ్, యెల్లో కలర్ పువ్వులు తమ వద్ద ఉన్నట్లు ఆయన చెప్పారు.