హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య రామయ్యకు బుధవారం సూర్యతిలక ధారణ అంగరంగ వైభవంగా జరిగింది. గర్భగుడిలోని బాల రాముని నుదుటి పై సూర్య తిలకం అలంకరణ విజయవంతంగా జరిగింది. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులంతా ఆనందోత్సాహాలతో తిలకించి, పరవశించిపోయారు. నవమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ దేశాల భక్తులు అయోధ్యకు పోటెత్తారు.
సూర్య వంశానికి చెందిన శ్రీరామునికి సూర్య కిరణాలతో తిలకం దిద్దడం బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు ప్రారంభమయింది. సూర్య కిరణాలు బాల రాముని నుదుటిపై పడటం సుమారు రెండున్నర నిమిషాలపాటు కొనసాగింది. సూర్య తిలకం మెకానిజా న్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సంయుక్తంగా డిజైన్ చే శాయి. సూర్యుడి భ్రమణ కాలానికి అనుగుణంగా ఏటా శ్రీరామ నవమి రోజు సూర్యుడి కిరణాలు నేరుగా బాల రాము డి విగ్రహంపై పడేలా శాస్త్రవేత్తలు కృషి చే శారు. శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు తొలిసారి శ్రీరాముడిపై సూర్య కిరణాలు బొట్టు పెట్టినట్లుగా పడగా, వేద మంత్రోచ్ఛారణలతో సూర్య తిలకం కార్యక్రమాన్ని నిర్వహించారు.