Puri Shankaracharya | అయోధ్యలో జరిగే రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వెళ్లడం లేదని పూరీ శంకాచార్యులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని గంగాసాగర్లో జాతరకు పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాముడి విగ్రహాన్ని సరైన స్థలంలో ప్రతిష్టించాల్సిన అవసరం ఉందన్నారు. విగ్రహం ఏదైనా సరే సక్రమంగా ప్రతిష్ఠించబడాలని.. సరైన పూజలు, స్థాపన లేకపోతే విగ్రహానికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. పూజా తదితర కార్యక్రమాలన్నీ గ్రంథాల ప్రకారమే జరుగాలన్నారు.
రామ మందిరంపై నలుగురు శంకరాచార్యుల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని.. దీనిపై మేం ఏకీభవించడం లేదన్నది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. ఒక ప్రశ్నకు సమాధానంగా శంకారాచార్యులు స్పందిస్తూ.. రాజకీయ నాయకులకు పరిమితులు, బాధ్యతలు ఉన్నాయన్నారు. రాజకీయ నేతలు ప్రతిరంగంలో జోక్యం చేసుకోవడం పిచ్చిగా భావిస్తారన్నారు. మనకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్లాలి..? ఎక్కడికి వెళ్లకూడదు? ఏ ఆహారం తినాలి, ఏది తినకూడదు ? ఏ ప్రాంతంలో జోక్యం చేసుకోవాలి.. ఏ ప్రాంతంలో జోక్యం చేసుకోకూడదు ? అనే పరిమితులు ఉన్నాయన్న ఆయన.. శంకరాచార్యులకు పాలకులను పాలించే హక్కు ఉందన్నారు.
చట్టాన్ని పాటించడం ప్రధానమంత్రి లేదంటే దేశాధినేత బాధ్యత అని.. చట్టాన్ని ఉల్లంఘించడం తనకంటూ పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించడమంటే దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, స్వీయ విధ్వంసం మార్గాన్ని ఎంచుకోవడమేనన్నారు. జనవరి 22న నేను అయోధ్యకు వెళ్లడం లేదని.. అయోధ్యపై నాకు కోపం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా శంకరాచార్య తెలిపారు. తాను అయోధ్యకు వెళ్తూనే ఉన్నానని.. కానీ విగ్రహ ప్రతిష్ఠాపనకు అయోధ్య వెళ్లే ఆలోచన లేదన్నారు.