Ram Mandir | అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో వినియోగదారులకు ఢిల్లీ వ్యాపారులు శుభవార్త చెప్పారు. వస్తువుల కొనుగోలుపై భారీగా డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నగల వ్యాపారులు బంగారం, వెండి బహుమతి వస్తువులపై తగ్గింపును ఇవ్వనున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని 50 కంటే ఎక్కువ మార్కెట్లలో వ్యాపారులు తమ వినియోగదారులకు తగ్గింపులను ఇవ్వాలని ప్రణాళిక రూపొందించినట్లు ట్రేడర్స్ ఆర్గనైజేషన్ ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) చైర్మన్ బ్రిజేష్ గోయల్ తెలిపారు.
కమలనగర్ మార్కెట్ ప్రెసిడెంట్ నితిన్ గుప్తా మాట్లాడుతూ దుకాణదారులు 10శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. కరోల్ బాగ్ ట్యాంక్ రోడ్ మార్కెట్ మాజీ ప్రెసిడెంట్ రమేశ్ అహుజా మాట్లాడుతూ అదనంగా మూడు నుంచి ఐదుశాతం తగ్గింపు ఉంటుందని చెప్పారు. జీన్స్, టీ-షర్టులు, జాకెట్స్, ట్రాక్ సూట్స్పై తగ్గింపు ఇవ్వనున్నట్లు చెప్పారు. కశ్మీరీ గేట్ మార్కెట్ ప్రెసిడెంట్ వినయ్ నారంగ్ ఆటో స్పేర్ పార్ట్స్, వెహికల్ యాక్సెసరీస్పై నాలుగు శాతం అదనపు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు చెప్పారు.
రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలో మాంసం దుకాణాలు మూతపడనున్నాయి.
ఢిల్లీ మీట్ మర్చంట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఇర్షాద్ ఖురేషీ అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మాంసం దుకాణాలను మూసివేయాలని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక వ్యాపారాలను నిలిపివేయడంఓత పెద్దగా ప్రభావం ఉండదన్నారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లోని అనేక రెస్టారెంట్లు మాంసం వంటకాల వడ్డింపును నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. సోమవారం రోజున కన్నాట్ ప్లేస్లోని చాలా రెస్టారెంట్లు శాకాహారాన్ని మాత్రమే అందిస్తాయని న్యూ ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (NDTA) సంయుక్త కార్యదర్శి అమిత్ గుప్తా పేర్కొన్నారు.