Rakhi Sawant | బాలీవుడ్ నటి రాఖీ సావంత్.. తన చేష్టలతో, మాటలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల అదిల్ ఖాన్ను వివాహమాడినట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చిన ఆమె.. అంతలోనే అదిల్ ఖాన్పై దొంగతనం కేసు పెట్టింది. తన డబ్బు, ఆభరణాలను దొంగిలించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అదిల్ఖాన్ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాఖీ.. అదిల్పై సంచలన ఆరోపణలు చేసింది. అదిల్ తనని చిత్రహింసలు పెట్టేవాడని.. చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపింది. ‘నేను ఇప్పటికీ అతన్ని ప్రేమిస్తున్నా. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. కానీ అతను నన్ను దారుణంగా మోసం చేశాడు. నన్ను కొట్టి చిత్రహింసలు పెట్టేవాడు. అతను ఓ పెద్ద వ్యాపారవేత్త అని, నాకు కారు, బంగ్లా గిఫ్ట్గా ఇచ్చినట్లు అందరికీ చెప్పమనేవాడు. అలా చేయనట్లైతే నన్ను పెళ్లి చేసుకోనని బెదిరింపులకు దిగేవాడు. వేరే అమ్మాయిలతో బెడ్ షేర్ చేసుకుని.. ఆ వీడియోలు నాకు పంపిస్తానన్నాడు. వాటిని చూసి నేను గుండెపగిలి చావాలని కోరుకున్నాడు. ‘నువ్వు నాకు వ్యతిరేకంగా వెళ్తే.. రూ.50 వేలు ఇచ్చి ట్రక్కుతో నిన్ను ఢీ కొట్టిస్తా’ అని బెదిరించేవాడు. అదిల్కు ఆల్రెడీ పెళ్లైంది. విడాకులు కూడా అయ్యాయి. అతడికి చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్ ఉంది. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. నా జీవితం నాశనం అయింది. మా అమ్మ చనిపోయింది. ఇప్పుడు నేను జీవచ్చవంలా బతుకుతున్నా’ అంటూ రాఖీ కన్నీరు పెట్టుకుంది.